Disclaimer : http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for
the immediate information to the visitors. This does not constitute to
be a legal document. While all efforts have been made to make the
information available on this website as authentic as possible, Indianpress365daysor any staff persons will not be responsible for any loss to
persons caused by any shortcoming, defect or inaccuracy in the
information available on website.
హైదరాబాద్, జూలై 31: రాష్ట్రాన్ని విభజించాలంటూ సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీలు చెప్పేశాయి. ఇక రాష్ట్రం విడిపోవడం ఖాయమైపోయిం ది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ప్రయోజనాలను పరిరక్షించే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో..ముందుగా హైదరాబాద్, నీరు, విద్యుత్తు వంటి ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సి ఉంది. తెలుగువాళ్లు అన్నదమ్ముల్లా విడిపోవడానికి సామరస్య పూర్వక వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. ఆందోళనలు, అలజడులు రేకెత్తకుండా జాగ్రత్త పడాల్సిఉంటుంది. 'విభజన' వేళ అందరి మదిలో గిలిపెడుతున్న సమస్యలివి. ఇదే అంశం పై 'పెద్ద మనుషులు కావలెను' అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ బుధవారం 'బిగ్ డిబేట్'ను నిర్వహించింది.
మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించగా.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్తో పాటు వివిధ ప్రధాన పార్టీల నేతలు, వేదికల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నా రు. విభజనకు అడ్డుగా ఉన్న ఒక్కో జఠిల సమస్యపై ఎండీ రాధాకృష్ణ.. అతిథులను ప్రశ్నిస్తూ చర్చను ముందుకు నడిపించారు.
విభజనలో పెద్దమనుషులు పాత్రపై.. అభిప్రాయ భేదాలు, ద్వేషాలను పక్కకు పెట్టి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సీనియర్ రాజకీయ నేత చెన్నమనేని రాజేశ్వరరావు సూచించారు. ఉమ్మడి సమస్యలపై రాజకీయ పార్టీలు..పెద్ద మనుషుల పాత్ర పోషించాలని కోరారు.
రాజకీయ పార్టీల పాత్రపై.. వ్యవస్థలోనే లోపాలున్నాయని, వాటిని సామరస్యంగా వికేంద్రీకరించుకుంటేనే తెలుగు ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. విభజన అంశం అసెంబ్లీలో చర్చకు వస్తుంది కాబట్టి..సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం సరికాదని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. రాజీనామా చేయడం వల్ల తమ ప్రజల వాదనలు, మనోభావాలను తెలిపే అవకాశాన్ని కోల్పోతారని వివరించారు. రాజకీయ పార్టీలు వాస్తవాలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నేత కె. రామకృష్ణ సూచించారు.
తాము విభజనను కోరుతుండగా, సీపీఎం సమైక్యాంధ్రకు కట్టుబడిందని.. ఈ పరిస్థితుల్లో వామపక్షాలు పెద్దన్న పాత్ర పోషించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. సీడబ్ల్యూసీ తీర్పు ఇచ్చేసినందున..చేసేదేం లేకపోయినా, సీమాంధ్ర ప్రాంత మనోభావాలను రాజకీయ పార్టీలుగా తాము వ్యక్తం చేస్తున్నామని మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వివరించారు. దిగ్విజయ్.. టీఆర్ఎస్తో విలీనం గురించి, మంత్రి టీజీ వెంకటేశ్ 'రాజధాని' గురించి.. ఇలా ఒకేపార్టీలో ఇన్ని వాదనలు వినిపిస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేస్తున్నట్టు కాదా అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్ సమస్యపై.. ఇప్పటివరకు దేశంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటి విషయంలో రాజ్యాంగ పరంగా తీసుకున్న జాగ్రత్తలన్నింటినీ తెలంగాణ విషయంలోనూ తీసుకుంటారని టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. "ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఎక్కడివారో హైదరాబాద్కు వచ్చి నివసిస్తున్నారు. మిమ్మల్ని(సీమాం«ద్రులు) వెళ్లిపోవాలని ఎవరు చెప్పారు? వ్యాపారాలు చేసుకోవద్దని ఇక్కడ ఎవరైనా చెప్పారా? విశాల దృక్పథంతో ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలి'' అని సూచించారు. ఏదో ఒక ప్రాం తాన్నే అభివృద్ది చేయడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమయిందని మంత్రి వర ప్రసాద్ అన్నారు. కేరళలో త్రివేండ్రంతో పాటు కొచ్చిన్ వంటి నగరాలు అభివృద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించారు.
హైదరాబాద్లోని వారందరికీ ఎలాంటి సమస్య లేకుండా చూసేందుకు రాజకీయ పార్టీలన్నీ శ్రమించాలని రాజేశ్వరరావు కోరారు. చాలా మంది సీమాంధ్ర యువకులు హైదరాబాద్తో అనుబంధం పెంచుకొని.. ప్లాట్లు కొనుక్కుని నివసిస్తున్నారని, ఇప్పటి పరిస్థితుల్లో తమకు భరోసా లేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. మజ్లిస్ నేత ఒవైసీ సూచించినట్టు.. హైదరాబాద్లో ఉన్నవాళ్లకీ భరోసా ఇస్తూ చట్టం తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ పాతబస్తీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని పట్టించుకోకపోవడం వల్లనే విభజన వాదాలు ముందుకు వస్తున్నాయని మాడభూషి శ్రీధర్ అన్నారు.
జల సమస్యలపై.. నీరే ప్రధాన సమస్య అని, దీనిని కేంద్ర జాబితాలో ఉంచితే మంచిదని.. ఎవరి వాటా వారికి వేసి చట్టం చేయాలని మంత్రి వర ప్రసాద్ సూచించారు. జలాలపై ప్రజలు ఆందోళన చెందటంలో అర్థం ఉన్నదని, బోర్డు ఉన్నా తుంగభద్ర జలాల విషయంలో ప్రతిసారీ వివాదాలు రేకెత్తుతుండటమే దీనికి కారణమని రామకృష్ణ వివరించారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని ఆలమట్టి నుంచి మన రాష్ట్రానికి తాగు నీరే సరిగ్గా వదలడం లేదని సోమిరెడ్డి తెలిపారు. వట్టి బోర్డుల ప్రయోజనం లేదని గత అనుభవాలు చెబుతున్నాయని వాదించారు. జల నిబంధనలకు విరుద్ధంగా పోవడం వల్లనే లొల్లి తలెత్తుతున్నదని ఈటెల అభిప్రాయపడ్డారు. తటస్థ వ్యక్తులతో కమిటీ ఏర్పాటుచేసి పరిష్కారం కనుగొనాలని మాడభూషి శ్రీధర్ సూచించారు.
సామరస్య సాధనపై.. అణగారిన వర్గాలకు చెందిన వారిపట్ల తమకు సానుభూతి ఎప్పుడూ ఉంటుందని, తెలంగాణకు మద్దతుగా గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ధర్నాలు జరిగాయని ఈటెల గుర్తు చేశారు. రాజధాని, నీరు అంశాలపై ముందుగా మూడు ప్రాంతాలకు చెందిన మంత్రులకు ఒక అవగాహన కల్పించాలని, అప్పుడు వారు ప్రజలను నడిపించగలుగుతారని సోమిరెడ్డి సూచించారు. పరస్పరం ఘర్షించుకోవడం కాక, రెండు రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. న్యాయంగా రావాల్సిన వాటిని రాబట్టుకోవాలని మాడభూషి శ్రీధర్ కోరారు. సమైక్యాంధ్ర ఎందుకు కోరుకుంటున్నారనేది చర్చింకుండానే విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని, ఇక ముందైనా ఆంధ్రా ప్రాంతానికి భరోసా ఇచ్చే చర్యలు ఉండాలని మంత్రి వర ప్రసాద్ అభిలషించారు.
Google:Indianpress365days provides
the latest News time to time for your better entertainment , Don’t forget keep watch
this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/
Disclaimer : http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for
the immediate information to the visitors. This does not constitute to
be a legal document. While all efforts have been made to make the
information available on this website as authentic as possible, Indianpress365daysor any staff persons will not be responsible for any loss to
persons caused by any shortcoming, defect or inaccuracy in the
information available on website.
Agraandhra band on yesterday, Andhra band yesterday, telangana issues, Telangana latest news updates,
ఆగ్రహాంధ్ర
హైదరాబాద్, జూలై 31: ఒక భాషగా, ఒక జాతిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయడంపై సీమా ంధ్ర భగ్గుమంది. ఇదేమి 'ఇటలీ న్యాయం?' అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యాగాంధీని నిలదీసింది. తెలుగుతల్లి కంట రక్తకన్నీరు పెట్టిస్తున్నారంటూ మండిపడింది. మొన్నటిదాకా తెలంగాణలో కనిపించిన రాళ్లవర్షం, లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంతోపాటు బలిదానాలు ఇప్పుడు సీమాంధ్రలోనూ మొదలయ్యాయి. బుధవారం రాయలసీమ, కోస్తాంధ్ర ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలతో భగ్గుమన్నాయి. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపారవర్గాలు ప్రారంభించిన 72 గంటల బంద్ తొలిరోజు సంపూర్ణంగా జరిగింది.
అనంతపురం జిల్లాకేంద్రంతోపాటు కదిరి పట్టణం లో ఆందోళనకారులు రాష్ట్రం ముక్కలవడానికి ఇందిర, రాజీవ్ల వారసత్వమే కారణమంటూ ఇందిర విగ్రహాల మెడలో పాతటైర్లు వేసి నిప్పంటించి, విగ్రహాలను కూ ల్చివేశారు. రాజీవ్ విగ్రహాన్ని పెకలించి మెడకు తాడు బిగించి ఈడ్చుకుంటూ వెళ్లి ఇందిర విగ్రహం పక్కనే పడేశారు. ప్రధాన రహదారుల్లోని పలు దుకాణాల అ ద్దాలు, బోర్డులను ధ్వంసం చేశారు. డివైడర్లను తొలగించారు. ఐదు ఆర్టీసీ బస్సుల ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలు, ఎమ్మార్వో ఆఫీసుపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ శ్యాంసుందర్, ఏఎస్పీ నవదీప్సింగ్తోపాటు కొందరు పోలీసులు గాయ పడ్డారు. దీంతో వారు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.
సుమారు ఐదుగంటలపాటు ఈ 'యుద్ధం' సాగింది. మడకశిరలో మంత్రి రఘువీరా ఇంటిని ముట్టడించి రాజీనామాకు డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ నిర్ణయం విచారకరం. తల్లి చనిపోయిన బా ధలో ఉన్నాను. నాలుగు రోజుల్లో స్పందిస్తాను' అని ఆయన చెప్పడంతో శాంతించారు. కదిరిలో పంచాయతీరాజ్ కార్యాలయం, రిలయన్స్ ఇన్సూరెన్స్ ఆఫీసుపై దాడి చేశారు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు విద్యార్థులు ఆమరణ దీక్ష ప్రారంభించారు. ధర్మవరంలో వేలాదిగా కిలోమీటరు పొడవున రైలు పట్టాలపై బైఠాయించి, రాత్రి 8 గంటలవరకు రైళ్లను అడ్డుకున్నారు.
కడప: కడప జిల్లాలోని 8 డిపోల నుంచి ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ బస్సు కూడా కదల్లేదు. సాయంతం 5 గంటలదాకా సంపూర్ణంగా బంద్ జరిగింది. అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. రెండు ఏటీఎంల అద్దాలు ధ్వంసం చేశారు. పలుచోట్ల సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి సెల్టవర్ ఎక్కి దూకుతానని హెచ్చరించడంతో రెండుగంటలపాటు ఉద్రిక్తత ఏర్పడింది. అతని ఆరేళ్ల కుమారుడు 'నువ్వు దూకితే నేనూ దూకుతా' అనడంతో దిగివచ్చాడు. జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆమరణ దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. చిత్తూరు: పంచాయతీ ఎన్నికలున్న చోట మినహా... జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది.
తిరుమలకు తప్ప జిల్లాలో ఇతర ప్రాంతాలకు బస్సులు ఆగిపోయాయి. తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్తలు ఓ కారును దహనం చేశారు. ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి నిరశన చేపట్టారు. ఎస్వీ, మహిళా వర్సిటీల విద్యార్థులు బంద్లో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు గ్యారేజీలో వంటావార్పు నిర్వహించారు. చిత్తూరులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు గురువారం నుంచి 48గంటల నిరాహారదీక్ష చేస్తాన ని ప్రకటించారు. మదనపల్లెలో చేనేత కార్మికులు ముంబై-చెన్నై జాతీయ రహదారిపై మూడుగంటలు ధర్నాచేశారు. బంద్వల్ల వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ తగ్గింది.
కర్నూలు: కర్నూలు నుంచి డోన్దాకా బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకోలతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆత్మకూరులో ఉద్యమకారులు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిని ముట్టడించి అద్దాలను బద్దలుకొట్టారు. నంద్యాలలో కాంగ్రెస్, వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. డోన్లో ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి నివాసాన్ని ముట్టడించారు. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో గురువారం పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. బస్సులు తిరగకపోవడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గిపోయింది.
బెజవాడ: విజయవాడలో ఎన్జీవోలు, ఆర్టీసీ, విద్యుత్తు, ఉడా ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు కదంతొక్కారు. యూత్ కాంగ్రెస్ నేత దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సాగింది. పలు సెంటర్లలో రాస్తారోకో చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు యత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభు త్వ కార్యాలయాల్లో పనులు స్తంభించాయి.
గుంటూరులో: ఉదయం ఆరుగంటల నుంచే ఉద్యమకారులు బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు, సినిమా హాళ్లు అన్నీ మూతపడ్డాయి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మస్తాన్ వలి ఆధ్వర్యంలో కార్యకర్తలు సోనియా చిత్రం ముద్రించిన కాంగ్రెస్ జెండాలతోనే ఆందోళనల్లో పాల్గొన్నా రు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్, గౌరవాధ్యక్షుడు నరసింహారావు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ బంద్ నిర్వహి ంచారు. పొన్నూరులో టీడీపీ శ్రేణులు కూడా బంద్ నిర్వహించాయి.
ఏఎన్యూ విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నాచేశారు. ఏపీఎన్జీవో సంఘం ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. పెట్రోల్ డీలర్ల సంఘం ప్రతినిధు లు కూడా బంద్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రైవేటు బీఈడీ కళాశాలల సం ఘం గురువారం నుంచి 8వ తేదీ వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.
తూర్పు గోదావరి: రాజమండ్రిలో విభజనకు మీరంటే మీరే కారణమంటూ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ వర్గాలు దు మ్మెత్తి పోసుకున్నాయి. పట్టణంలోని అన్నివర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. థియేటర్లు కూడా మూ తపడ్డాయి. వైసీపీ కార్యకర్తలు కాం గ్రెస్ ఆఫీసు ముందు ఎంపీ ఉండవల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీం తో అక్కడ ఘర్షణ జరిగింది.
ఆర్డీవో, పీఎఫ్, బీమా కంపెనీ కార్యాలయాలపై ఉద్యమకారులు దాడికి దిగి అ ద్దాలు ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ను సోనియాగాంధీ రంపంతో కోస్తు న్న చిత్రాన్ని నగరంలో ప్రదర్శించారు. విభజన జరిగితే కాం గ్రెస్కు పుట్టగతులుండవని కాకినాడలో ఎమ్మెల్యే గాంధీమోహన్ మండిపడ్డా రు. రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పిఠాపురంలో స్టేట్ బ్యాంక్, ఒక మద్యం దుకాణంపై దాడికి దిగారు. జిల్లావ్యాప్తంగా 20 బస్సులను ధ్వంసం చేశారు. ఒక డ్రైవర్, మరొక ప్రయాణికుడు గాయపడ్డారు. ఆర్టీసీకి రూ.55 లక్ష ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి: జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఏలూరులో వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఉద్యోగ, విద్యార్థి సంఘాలతోపాటు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెంతోపాలు పలు మండల కేంద్రాల్లో రాస్తారోకో, మానవహారం, ధర్నా తదితరాలు నిర్వహించారు. ఓ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.
ప్రకాశం: జిల్లాలో విద్యార్థి జేఏసీతోపాటు వైసీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఒంగోలులో బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. నిరసనలు తీవ్రస్థాయిలో జరిగినా బంద్ మాత్రం పాక్షికంగా జరిగింది. పోలీసులు భారీగా మోహరించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
నెల్లూరు: బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలతో సోనియా దిష్టిబొమ్మలను తగలబెట్టారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నాడు రాష్ట్ర సాధనకు పోరాడిన యోధులు కంటతడిపెట్టారు. విద్యార్థి జేఏసీ రైలురోకో నిర్వహించింది. మం త్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశాకే నెల్లూరు గడ్డపై అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం: విశాఖలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ 26 0 బస్సులను నిలిపివేసింది. ఆంధ్ర వర్సిటీలో విద్యార్థి జేఏసీ నేతల ఆమరణ దీక్షకు కాంగ్రెస్, వైసీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆందోళనలు మరింత తీవ్రంచేయాలని, సంపూర్ణంగా సహకరిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో సమైక్యవాదాన్ని వినిపించడం కోసమే రాజీనామా చేయలేదని ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తెలిపారు. విద్యార్థి నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్ కాళ్లపైపడి సమైక్యాంధ్రకు మద్దతు కోరారు. విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
విజయనగరంలో...: జిల్లాలో అన్నివర్గాలవారు బంద్లో పాల్గొన్నారు. లాయర్లు జిల్లాకోర్టు ప్రధాన ద్వారానికి తాళంవేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, బడ్డుకొండ అప్పలనాయుడు, జనార్దన్ థాట్రాజ్, సవరపు జయమణి, ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, గాదె శ్రీనివాసులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. రాజీనామాకు సిద్ధమని, స్పీకర్ ఫార్మాట్లో సంతకం చేసి ఉంచుకున్న పత్రాలను చూపించారు.
శ్రీకాకుళం: జిల్లాల్లో నేతలు పట్టి ంచుకోకపోయినా విద్యార్థి, ఉద్యోగ, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు గర్జించారు. యూపీఏ ప్రభుత్వం, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వివిధ పట్టణాల్లో ర్యాలీలు సాగాయి. టెక్కలి డివిజన్లో పంచాయతీ ఎన్నికలున్నా ఉద్యమ వేడి తగ్గలేదు.
ఆగిన చక్రాలు సీమాంధ్ర బంద్ కారణంగా హైదరాబాద్కు రావాల్సిన బస్సులు ఆగిపోయాయి. ప్రధానంగా... కర్నూలు సెక్టార్ నుంచి బస్సులు నిలిచిపోయాయి. సీమాంధ్ర జిల్లాల నుంచి రోజుకు 2300 బస్సులు రావాల్సిఉండగా... బుధవారం 1900 బస్సులు మాత్రమే వచ్చాయి. బంద్ నేపథ్యంలో బెంగళూరు, మైసూరు, కడప, అనంతపురం తదితదిర ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ, ఒంగోలు, నె ల్లూరు ప్రాంతాల నుంచి బస్సులు యథాతథం గా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇ క... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన బస్సులు కూ డా ఆగిపోయాయి. Google:Indianpress365days provides
the latest News time to time for your better entertainment , Don’t forget keep watch
this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/
Disclaimer : http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for
the immediate information to the visitors. This does not constitute to
be a legal document. While all efforts have been made to make the
information available on this website as authentic as possible, Indianpress365daysor any staff persons will not be responsible for any loss to
persons caused by any shortcoming, defect or inaccuracy in the
information available on website.
రాజకీయ కోణం ఏమీ లేదు తెలంగాణ క్లిష్యమైన సమస్య రెండు ప్రాంతాలూ ముఖ్యమే: దిగ్విజయ్
July 30, 2013
న్యూ ఢిల్లీ, జూలై 30: తెలంగాణ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడంలో రాజకీయపరమైన అంశాలేవీ లేవని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.
తెలంగాణ విభజన గురించి కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోవడం అంత తేలికగా జరగలేదని, ఇందులో అన్ని పార్శ్వాలనూ పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. తెలంగాణా, సీమాంధ్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన చెప్పారు.
తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ నాలుగైదు నెలలలో పూర్తి అవుతుందని, అందుకు అందరూ సహకరించాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు. ఆస్తుల గురించి, భద్రత గురించి గల అనుమానాలకు కేంద్రం పరిష్కారం చూపిస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాల పరిమితి ఉంటుందని, అది నాలుగైదు నెలలలో పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. మిగిలిన చోట్ల గల చిన్న రాష్ట్రాల డిమాండును తెలంగాణాతో పోల్చలేమని ఆయన చెప్పారు. సీమాంధ్ర మనోభావాలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణా తీర్మానం ఉంటుందని ఆయన చెప్పారు.
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ గతంలో ప్రకటించారని, ఇప్పుడు తెలంగాణను ప్రకటించాం గనక కేసీఆర్ స్పందనకోసం చూస్తామని దిగ్విజయ్ చెప్పారు.
Google:Indianpress365days provides
the latest News time to time for your better entertainment , Don’t forget keep watch
this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/
Disclaimer : http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for
the immediate information to the visitors. This does not constitute to
be a legal document. While all efforts have been made to make the
information available on this website as authentic as possible, Indianpress365daysor any staff persons will not be responsible for any loss to
persons caused by any shortcoming, defect or inaccuracy in the
information available on website.